Monday 23 January 2012

నా రచనలు(పుస్తకాలు)



యానాం  చరిత్ర





Click on the image to view large












                  



















































































































































































































































































































































































































































































పాఠం పూర్తయ్యాక
(కవితా సంపుటి),
కవి- దాట్ల దేవదానంరాజు,
వెల: రు.60/-,
ప్రతులకు:
కవి పేర,
జక్రియానగర్,
యానాం- 533464


‘‘భాషకు గతుల్ని నేర్పి
కొత్త గొంతుకల్ని సృష్టించాడు
కొత్త లోకపు ద్వారాల్ని తెరిచి
మానవ గీతాల్ని ఆలపించాడు’’
- అతనే దాట్ల దేవదానంరాజు. కవిత్వం అతని శ్వాస. ఒక్కొక్క సంపుటికీ గుండె చప్పుళ్ళను చెక్కుకుంటు కవిత్వమై ప్రవహించే దాట్లవారి ఎనిమిదో కవితా సంపుటి ‘‘పాఠం పూర్తయ్యాక...’’ ఈ కవిత్వం చదివిన తర్వాత శిఖామణి అన్నట్టు- మట్టి మంచిగంధంలా పరిమళించటం, వెనె్నల చల్లగా మాట్లాడటం, ఎవరో వత్తిని ఎగదోసినట్టు మన యెదలోపలి దీపాలు వెలగడం... వంటి అనుభూతులు తప్పవు.
‘‘మొసలి కన్నీటి సానునయాల్నే
శ్వాసల్ని నులిమేసే నైరాశ్య తీరాల్నే దాటి
నేతన్నల చుట్టూ గీసిన చీకటి గీతల్ని చెరిపి
బతుకు భరోసా ఇవ్వాలి’’
అంటూ నేతన్నలపై రాజకీయాల దిగజారుడుతనాన్ని నిరసిస్తాడు. అంతేకాదు రైతన్నల పక్షాన గళమై గర్జిస్తాడు. దాట్ల రైతు మాత్రమేకాదు ఉపాధ్యాయుడు కూడా. గురువుగా గర్వించే కవి కాబట్టి
‘‘మట్టిని మంచి గంధం చేసే
సృజనాత్మక శ్రమ అది
ఒక్క ఉపాధ్యాయునికే
అబ్బిన విద్య అది’’
అనగలిగాడు. ఈయనకు అపూర్వమైన భావాలు వస్తాయి. వాటికి పదునుపెడుతి కవిత్వాన్ని చిలకరిస్తాడు. గొప్ప శైలిలా వుండదు కాని అక్షరాలను చెక్కటంలో నేర్పరి. గుండెను ఛిద్రంచేసే భావాలను కూడా సంయమనంతో శిల్పీకరించటం- మన గుండెల్ని ఆర్ద్రంచెయ్యటం రాజుగారి కవితా నిర్మాణ రహస్యం అనడానికి అనంతరం అనే కవిత మచ్చుతునక-
‘‘దుర్గుణావశేషాల్ని
కాసేపు మరచిపోవడమే
శవ సమయం...’’
అంటూ శవం జయం అంటాడు, మళ్ళీ అపజయం అంటాడు. శవ సందర్భంపై ఇలా రాసిన కవి మరొకరు లేరనుకుంటాను. దాట్లవారు పలు విధాలుగా ప్రతిస్పందిస్తారు. దానిని అక్షరాలతో కూరుస్తారు. శివారెడ్డి కవితకు ప్రతి కవిత రాయడం, యానాం గోదావరి ఒడ్డున నుంచున్న విదేశీ వనితపై రాయడం, క్రాప్ హాలిడే ప్రకటించిన రైతుక్షోభపై రాయడం, బాపుగారిపై రాయడం, జంతు ప్రేమికుడు జి.ఎన్.నాయుడు గారిపై రాయడం... నిదర్శనాలు. దాట్లవారి ఉపమానాలు సరికొత్తగా సందర్భోచితంగా ఉంటాయనడానికి ఉదాహరణలు:
‘‘రాటకు కట్టిన లేగ దూడల్లా’’
‘‘పాలిపోయి వెలిసిన రంగుల్లా’’
‘‘ఒత్తిడికి కందిపోయే పూలరేకుల్లా’’
‘‘దేవుని పటంలోని కాంతి వలయంలా’’
కవిత్వంలో పరిణతికెక్కిన దాట్లవారు ఎందువల్లనో కొన్నిటిని ఇంకా చెప్పవలసి వుందనిపించేలా సంక్షిప్తంగా ముగించడం గమనిస్తాం. దేవదానంరాజు కవిత్వంలో చదవడం మరపురాని అనుభూతి.

భావాలకు పదునుపెట్టిన కవిత్వం ( ఆంధ్ర భూమి)
-ద్వా.నా.శాస్ర్తీ 23/12/2012







దాట్ల దేవదానం రాజు రచించిన 'పాఠం పూర్తయ్యాక..' కవితా సంపుటిని  (8వ ది ) ప్రసిద్ధ కధకుడు పోరంకి దక్షిణామూర్తి ఆవిష్కరిస్తున్న దృశ్యం .
చిత్రంలో పి. చిరంజీవినీ కుమారి , గంటేడ గౌరునాయుడు, అదృష్ట దీపక్, గంటి భానుమతి, పి. సత్యవతి, వాడ్రేవు వీరలక్ష్మి దేవి వున్నారు.

కధాపఠనంలో దేవదానం రాజు








































No comments:

Post a Comment